Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరపైకి ఫెడరల్ ఫ్రంట్.. ప్రాంతీయ శక్తుల ఏకీకరణకు లాలూ పిలుపు

Webdunia
శనివారం, 28 మే 2016 (12:06 IST)
దేశంలో ఫెడరల్ ఫ్రంట్ తెరపైకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రాంతీయ శక్తులన్నీ ఏకీకరణ కావాలంటూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కతాటిపై నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కివక్కాణించారు. 
 
కోల్‌కతాలో జరిగిన మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారానికి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావసారూప్యత కలిగిన సెక్యులర్ పార్టీలు ఏకతాటిమీదకు వచ్చి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని, బీజేపీ, ఆరెస్సెస్‌ను కేంద్రం నుంచి తప్పించాలని పిలుపునిచ్చారు. 
 
సకాలంలో మేలుకొని సమైక్యం కాకపోతే మతవాద శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయని హెచ్చరించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కూడా ఇదేతరహా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పైగా ఫ్రంట్‌కు మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తే బాగుంటుందని సూచించారు. 
 
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా ప్రాంతీయ పార్టీల కూటమి పోటీకి దిగుతుందేమో అనే ఊహాగానాలు జరుగుతున్నాయి. మొట్టమొదటి బెంగాలీ ప్రధానమంత్రి కాబోతున్నారా అని మీడియా అడిగితే మమత, నేను సామాన్యురాలిని అంటూ సమాధానం దాటవేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments