Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంఝీజీ.. జనతా పరివార్‌లో చేరండి : లాలూ ప్రసాద్ యాదవ్ పిలుపు

Webdunia
గురువారం, 21 మే 2015 (16:46 IST)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీకి జనతా పరివార్‌ ఆహ్వానం అందింది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆరు ప్రధాన పార్టీలు కలిసి ఒకే వేదికపైకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ కూటమికి జనతా పరివార్ అనే పేరు పెట్టారు. ఇందులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, నితీశ్ కుమార్‌కు ఒకప్పుడు రాజకీయ సన్నిహితుడైన జితన్ రాం మాంఝీని జనతా పరివార్‌లో చేరాలంటూ పిలుపు వచ్చింది.
 
ఈ మేరకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. ఇదే అంశంపై ఆయన గురువారం ఓ ఆంగ్ల టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'బీజేపీకి వ్యతిరేకంగా మేమంతా పార్టీల వేదికగా ఐక్యమవుతున్నాం. ఇందులో మాంఝీ, ఇతరులు కూడా మాతో కలసి రావొచ్చు' అని లాలూ పేర్కొన్నారు. 
 
వచ్చే ఏడాది బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీని ఎలాగైనా ఎదుర్కోవాలని జనతా పరివార్ లోని నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం కావల్సిన బలాన్ని కూడగట్టుకునే యత్నం పరివార్ చేస్తుందని, అందులో భాగంగానే మాంఝీని ఇలా ఆహ్వానించారని పలువురు అంటున్నారు. మరీ పిలుపుకు మాంఝీ ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments