Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీనామా చేయాలనిపిస్తోంది... వాజ్‌పేయి ఉంటే బాధపడేవారు : ఎల్కే.అద్వానీ

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన మనసులోని వేదనను బహిర్గతం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. దేశంలో కరెన్సీ నోట్ల రద్దుపై విపక్ష పార్టీలు

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (13:01 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన మనసులోని వేదనను బహిర్గతం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. దేశంలో కరెన్సీ నోట్ల రద్దుపై విపక్ష పార్టీలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ నోట్ల రద్దుపై సభలో చర్చించాలని పట్టుబట్టి.. సభా కార్యక్రమాలను సాగనీయకుండా చేశాయి. ఈ తీరుపై అద్వానీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మొదట కేంద్ర మంత్రి అనంతకుమార్‌ వద్ద ప్రస్తావించారు. 
 
ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయమై మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌ను ఆయన కోరారు. అద్వానీ మాటలను రాజ్‌నాథ్ శ్రద్ధగా ఆలకించారు. "కనీసం ఈ రోజు ఒక రోజైనా సమావేశాలు సజావు‌గా జరపాలని లేదా జరిగేలా చూడాలని" రాజ్‌నాథ్‌తో అద్వానీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజీనామా చేయాలని అనిపిస్తోందని, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారంటూ వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments