Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీనామా చేయాలనిపిస్తోంది... వాజ్‌పేయి ఉంటే బాధపడేవారు : ఎల్కే.అద్వానీ

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన మనసులోని వేదనను బహిర్గతం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. దేశంలో కరెన్సీ నోట్ల రద్దుపై విపక్ష పార్టీలు

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (13:01 IST)
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ తన మనసులోని వేదనను బహిర్గతం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. దేశంలో కరెన్సీ నోట్ల రద్దుపై విపక్ష పార్టీలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ నోట్ల రద్దుపై సభలో చర్చించాలని పట్టుబట్టి.. సభా కార్యక్రమాలను సాగనీయకుండా చేశాయి. ఈ తీరుపై అద్వానీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మొదట కేంద్ర మంత్రి అనంతకుమార్‌ వద్ద ప్రస్తావించారు. 
 
ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఈ విషయమై మాట్లాడారు. సభ సజావుగా జరిగేందుకు జోక్యం చేసుకోవాలని రాజ్‌నాథ్‌ను ఆయన కోరారు. అద్వానీ మాటలను రాజ్‌నాథ్ శ్రద్ధగా ఆలకించారు. "కనీసం ఈ రోజు ఒక రోజైనా సమావేశాలు సజావు‌గా జరపాలని లేదా జరిగేలా చూడాలని" రాజ్‌నాథ్‌తో అద్వానీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రాజీనామా చేయాలని అనిపిస్తోందని, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ సభలో ఉండి ఉంటే చాలా బాధపడేవారంటూ వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments