Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూర్తిగా మునిగిపోకముందే మేల్కో : మోడీకి ఎంపీ హెచ్చరిక

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (11:48 IST)
ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వెళ్లిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోడీకి కష్టాలు ఎక్కువయ్యాయనీ కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్‌సజనశక్తి ఎంపీ చిరాగ్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల పూర్తిగా మునిగిపోకముందే మేల్కోవాలని ఆయన హెచ్చరించారు. 
 
ఇటీవల రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఆయన కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మోడీ - షాల వైఖరి ఏమాత్రం బాగోలేదన్నారు. 
 
ఈ నేపథ్యంలో చిరాగ్ పాశ్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పోస్టు చేస్తూ, ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిన తర్వాతే ఎన్డీయేకు కష్టాలు ప్రారంభమయ్యాయని, సహచర పార్టీలతో ఉన్న విభేదాలను పరిష్కరించడంలో బీజేపీ పెద్దలు విఫలమవుతున్నారన్నారు. 
 
'ఎన్డీయే నుంచి టీడీపీ, ఆర్ఎల్ఎస్పీ వెళ్లిపోవడంతో క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి మరింత దారుణంగా మారకముందే బీజేపీ చర్యలు తీసుకోవాలి. పూర్తిగా చేతులు కాలకముందే గౌరవప్రదమైన పద్ధతిలో భాగస్వాముల సమస్యలు పరిష్కరించాలి' అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments