Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జంట సినిమాకు వెళ్లింది.. థియేటర్లో తాళి, మెట్టెలు తీసేసి..?

Webdunia
బుధవారం, 29 మే 2019 (11:22 IST)
కొత్తగా పెళ్లైంది. నవ దంపతులు జంటగా సినిమాకు వెళ్లారు. అయితే సినిమా థియేటర్లో కూర్చున్నాకే వరుడికి గట్టి షాక్ తెలిసింది. కొత్త పెళ్లి కూతురు థియేటర్లో తాళి, మెట్టెలతో పాటు నగలన్నీ తీసి పక్కనబెట్టేసి పారిపోయింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చెందిన అంజెట్టికి సమీపంలో సేసురాజపురంకు చెందిన లూర్థ్ స్వామి.. సెల్వి సహాయాన్ని ఇటీవల పెళ్లాడాడు. 
 
ఏప్రిల్ 27వ తేదీన వీరికి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి జంటగా సినిమాకు వెళ్లారు. థియేటర్లో సినిమా చూస్తుండగా.. కూల్ డ్రింక్స్, స్నాక్స్ కావాలని కొనుక్కుని రావాల్సిందిగా లూర్థ్ సామి వద్ద సెల్వి సహాయం అడిగింది. ఇక భార్య అడిగిందని కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకొచ్చేందుకు వెళ్లిన లూర్థ్ సామికి తిరిగొచ్చి చూడగా గట్టి షాక్ తప్పలేదు. 
 
తాళితో పాటు మెట్టెలు, బంగారు నగల్ని తీసి సీటు వద్ద వుంచేసిన సెల్వి సహాయం అక్కడి నుంచి పారిపోయింది. ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఈ ఘటనపై లూర్థ్ సామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments