Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం.. ఆరేళ్ల కుమారుడు బలి.. భర్తను అలా చూసిన పాపానికి?

Webdunia
గురువారం, 2 మే 2019 (14:32 IST)
అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా తండ్రి లైంగిక సంబంధం కొడు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీపురా ఏరియాలో ఆరేళ్ల చిన్నారి మృతదేహం కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల ఎంక్వైరీ‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
చనిపోయిన బాలుడు తండ్రికి లెదర్ బ్యాగ్స్ తయారు చేసే ఓ కంపెనీ ఉంది. అక్కడ పని చేసే ఓ పాతికేళ్ల యువకుడితో అతను లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలంగా అతని ప్రవర్తనలో మార్పు రావడం భార్య గమనించింది. దీంతో భర్తపై భార్య నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ రోజు భర్త మరో యువకుడితో ఉండటం తన కళ్లారా చూసి షాకైంది. ఆమెకు కోపం కట్టలు తెచ్చుకుంది. 
 
వెంటనే ఆ యువకుడికి నాలుగు చీవాట్లు పెట్టి.. తమ కంపెనీలో పనికి రావద్దని హెచ్చరించింది. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ యువకుడు ఆమె మీద కసి తీర్చుకోవాలనుకున్నాడు. ఆమె మీద కోపంతో ఆరేళ్ల కుమారుడిని అపహరించి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం