Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చివేస్తాం : ఖలీస్థాన్ టెర్రరిస్టుల హెచ్చరిక

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (08:54 IST)
ఖలీస్తానీ వేర్పాటువాది హర్దీబ్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చి వేస్తామని ఖలీస్తానీ ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన టెర్రరిస్ట్ గురుప్రత్వంత్ సింగ్ పన్ను హెచ్చరికలు జారీచేశాడు. ఈ మేరకు రికార్డు చేసిన ఓ వీడియోను రిలీజ్ చేశాడు. 
 
ఈ వీడియోలో భారత్‌తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు హెచ్చరిక జారీచేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిక్ ఫర్ జస్టిస్ గ్రూపు నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. 
 
ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబరు 5వ తేదీన ఈ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. దీంతో ఈ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. నిజ్జర్ హత్యపై మేం మీ బుల్లెట్‌కు వ్యతిరేకంగా మా బ్యాలెట్‌ను ఉపయోగించబోతున్నామని, తాము మీ హింసకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నామని చెప్పాడు. ఈ అక్టోబరు 5వ తేదీన జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్ నాంది నాంది అన్నాడు. ఈ సందేశం గురుప్రత్వంత్ సింగ్ పన్ను నుంచి వచ్చిందని ఆ రికార్డింగ్లో ఉంది.
 
అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అగౌరవపరిచినందుకు భారత రాయబారి వర్మను హతమారుస్తామని అందులో హెచ్చరించాడు. వర్మను భారత్‌తు తీసుకురావడం, ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments