Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని యువతిపై బస్సులో యువతిపై అత్యాచారం

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (17:08 IST)
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో మతిస్థిమితంలేని ఓ యువతిపై బస్సులో అత్యాచారం జరిగింది. ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ అడగడమే ఆ యువతి చేసిన తప్పు. ఇంట్లో దింపుతామని నమ్మించి బస్సులో ఎక్కించుకున్న కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళలోని కోజికొడ్‌ జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఓ యువతికి మతిస్థిమితం లేదు. ఆ యువతి తరచు తన తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వస్తుంది.
 
అయితే ఈ నెల 5వ తేదీన మరోసారి తన తల్లితో గొడవపడి ఊరి చివరకు వెళ్లింది. కొంతసమయం తర్వాత  తాను ఇంటికి వెళ్లాలనుకొని రోడ్డుపై పలు వాహనాలను లిఫ్ట్‌ అడిగింది. ఆమెను గమనించిన ముగ్గురు వ్యక్తులు లిఫ్ట్‌ ఇచ్చి ఇంటి వద్ద దింపుతామని బలవంతంగా పార్కింగ్ చేసివున్న ఓ ప్రైవేటుబస్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
తర్వాత ఆమెను ఊరిలోని ఆటో స్టాండ్‌ వద్ద వదిలేసి పరారయ్యారు. అయితే జరిగిన విషయాన్ని ఆ యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని  చేవాయూర్ పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments