Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి ఇంట్లోని పనివాడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు.. ఎలా?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (14:18 IST)
కేరళకు చెందిన నటి రజిని చాందీ ఇంట్లో గత కొన్నేళ్లుగా అస్సోం రాష్ట్రానికి చెందిన ఆల్బర్ట్ టిగా అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు. అదెలాగో ఓసారి తెలుసుకుందాం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే లాటరీ టిక్కెట్లను విక్రయిస్తుంది. వీటిని కొనుగోలు చేసే సామాన్య ప్రజలకు లక్కీడిప్ తగలుతుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులై పోతున్నారు. తాజాగా ఆల్బర్ట్ టిగా కూడా రాత్రికిరాత్రి కోటీశ్వరుడు అయ్యాడు. 
 
ఇటీవల ఆయనకు కేరళ లాటరీ విభాగం సమ్మర్ బంపర్ ఆఫర్ బీఆర్ 90 లాటరీ టిక్కెట్లను విక్రయించింది. ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన టిగాకు ఒక్కసారిగా పది కోట్ల రూపాయలకు బంఫర్ లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వెంటనే లాటరీ సొమ్మును క్లైం చేసుకుని ఆ టిక్కెట్‌ను కొచ్చిన్‌‍లోని భారతీయ స్టేట్ బ్యాంకుకు ఇచ్చాడు. ఎస్.బి.ఐ క్యాథలిక్ సెంటర్ శాఖలో మేనేజర్ గీవర్గీస్ పీటల్ ఆ సొమ్మును టిగాకు అందజేశాడు. ఎర్నాకులంకు చెందిన లాటరీ ఏజెంట్ ఎమ్డీ జాన్ ఈ టిక్కెట్‌ను విక్రయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments