Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 'నిఫా' వైరస్... వైద్యుల పర్యవేక్షణలో 86 మంది రోగులు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (11:02 IST)
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్‌ను గుర్తించారు. కొచ్చిన్‌కు చెందిన ఓ రోగిలో ఈ వైరస్‌ను గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కెకె.శైలజ అధికారికంగా వెల్లడించారు. అలాగే, వైద్యుల పర్యవేక్షణలో మరికొంతమంది ఉన్నట్టు తెలిపారు. ఈ రోగి 23 యేళ్ల కాలేజీ విద్యార్థి అని చెప్పారు. 
 
ఇదే అంశంపై మంత్రి శైలజ మాట్లాడుతూ, నిఫా వైరస్ సోకిన రోగిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆ రోగికి పూణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగం వైద్యులు జరిపిన పరిశోధనలో నిఫా వైరస్ సోకినట్టు తేలిందని, ఆ రోగిని ఎర్నాకులంలోని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 
 
దీనిపై మంత్రి శైలజ మాట్లాడుతూ, జ్వరం లక్షణాలతో ఇద్దరు ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరికి నిఫా వైరస్ సోకినట్టు తేలింది. మరొకరు జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. అయితే, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు చేపట్టామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. ఇదిలావుండగా, కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 86 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments