Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్యకారుడు కాదు... హృదయాలను గెలుచుకున్న రియల్ హీరో

కేరళలో వరద బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాట

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (09:01 IST)
కేరళలో వరద బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి వారి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, వెంగారలోని ముథాలమాద్ ప్రాంతంలోని ఒక ఇంటిలో ఒక చిన్నారితోపాటు ముగ్గురు మహిళలు చిక్కుకున్నారు. జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్) జవాన్లు ఈ ప్రాంతానికి వెళ్లలేమన్నారు.
 
కానీ, స్థానిక మత్స్యకారుడు కేపీ జైసాల్ (32) వారిని కాపాడటానికి ముందుకొచ్చారు. సదరు మహిళలు ఎన్డీఆర్‌ఎఫ్ బెలూన్ బోటులోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటే జైసాల్ తన వీపును మెట్టుగాచేసి బోటులోకి వెళ్లేందుకు వీలుగా కిందకు వంగారు. ఒకరి తర్వాత మరొకరు అతడి వీపుపై కాలుపెట్టి బోటులోకి వెళ్లిపోయారు. 
 
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. కేవలం జైసాల్ ఒక్కరే కాదు వందల మంది మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్న తోటి వారిని కాపాడేందుకు తమ బోట్లను ఎన్డీఆర్‌ఎఫ్, ఇతర సహాయ సిబ్బందికి అప్పగిస్తున్నారు. బాధితులను రక్షించడంలో ఎన్డీఆర్‌ఎఫ్ జవాన్లకు సాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments