Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి భారత సైన్యానికి ఆహ్వానం... శుభాకాంక్షలు తెలిసిన సైనికులు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (12:43 IST)
కేరళకు చెందిన రాహుల్, కార్తీక అనే యువతీయువకులు ఈ నెల 10వ తేదీన వివాహం చేసుకున్నారు. అయితే, ఈ వివాహానికి ముందు తమ పెళ్లికి రావాలని విజ్ఞప్తి చేస్తూ వారు భారత ఆర్మీని ఆహ్వానించింది. తమ పెండ్లి పత్రికను ఆర్మీకి పంపించింది. ఇందులో... 
 
"ప్రియమైన హీరోలకు..." అంటూ సైనికులను సంబోధిస్తూ, మీ ప్రేమ, దేశంపై మీకున్న భక్తి, విధి నిర్వహణలో మీరు చూపించే సాహసానికి మేమెంతో రుణపడి పోయామని ఆ జంట పేర్కొంది. 
 
"సరిహద్దుల్లో కాపలా కాస్తూ మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, మా జీవితాలను సంతోషంగా ఉంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు. మా పెళ్ళికి హాజరై మమ్మల్ని దీవించండి" అంటూ ఆ జంట పంపిన ఆహ్వాన పత్రికలో పేర్కొంది. 
 
కాగా, ఈ వివాహ ఆహ్వాన పత్రికపై ఇండియన్ ఆర్మీ అధికారులు స్పందించారు. పెళ్లి పత్రికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... పెళ్లికి పిలిచినందుకు ధన్యవాదాలు. భారత సైన్యం మీ జంటకు ఆశీస్సులు తెలియజేస్తుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తుంది" అని అధికారులు రిప్లై ఇచ్చారు. 
 
ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు తాము చూసిన పెళ్లి ఆహ్వాన పత్రికల్లో ఇదే ది బెస్ట్ ఇన్విటేషన్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments