కరోనా విధుల్లో మరణిస్తే భారీ పరిహారం : కేజ్రీవాల్ ఉదారం

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (15:25 IST)
కరోనా విధుల్లో నిమగ్న విధులు నిర్వహిస్తున్న వారు మరణించే వారి కుటుంబాలకు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారినపడుతున్న వారికి వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు రేయింబవుళ్లు సేవలు అందిస్తున్నారు. 
 
ఇలాంటివారిపై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఉదార స్వభావాన్ని చూపించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. 
 
శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల సేవలను గౌరవించి.. రూ.కోటి పరిహారాన్ని అందజేస్తామన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాగా, ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121కు చేరింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ నుంచి 6 మంది కోలుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments