Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా విధుల్లో మరణిస్తే భారీ పరిహారం : కేజ్రీవాల్ ఉదారం

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (15:25 IST)
కరోనా విధుల్లో నిమగ్న విధులు నిర్వహిస్తున్న వారు మరణించే వారి కుటుంబాలకు భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారినపడుతున్న వారికి వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్యకార్మికులు రేయింబవుళ్లు సేవలు అందిస్తున్నారు. 
 
ఇలాంటివారిపై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఉదార స్వభావాన్ని చూపించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. 
 
శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సుల సేవలను గౌరవించి.. రూ.కోటి పరిహారాన్ని అందజేస్తామన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న శానిటైజేషన్‌ వర్కర్లు, డాక్టర్లు, నర్సులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాగా, ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 121కు చేరింది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ నుంచి 6 మంది కోలుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments