Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 నుంచి కేదార్‌నాథ్ ధార్ యాత్ర ప్రారంభం

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (16:17 IST)
కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. కేదార్నాథ్ యాత్ర ఈ నెల 25వ తేదీన ప్రారంభమవుతుందని వారు వెల్లడించారు. ఈ యాత్రలో పాల్గొనదలచిన భక్తులు కాలి నడకతో పాటు హెలికాఫ్టర్ ద్వారా కేదార్నాథ్ చేరుకోవచ్చని వారు తెలిపారు. కేదార్నాథ్‌ ధామ్‌కు హెలికాఫ్టరులో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా కల్పించింది. ఈ పోర్టల్‌ను కూడా ఈ నెల 25వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
 
మరోవైపు. వచ్చే చార్‌ధామ్ యాత్ర కోసం ఇప్పటికే 6.35 లక్షల మంది భక్తులు దరఖాస్తు చేసుకున్నారని ఉత్తరాఖండ్ పర్యాటక అభివృద్ధి మండలి గత నెలలోనే వెల్లడించింది. వీరిలో కేదార్నాథ్ ధామ్‌కు 2.41 లక్షలు, బద్రీనాథ్‌ ధామ్‌కు 2.01 లక్షలు, యమునోత్రికి 95,107, గంగోత్రికి 96449 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ యాత్రలో ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య బృందాలను ఏర్పాటు చేస్తామని, ఇవి భక్తులకు సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments