Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే అధినేత కరుణానిధికి అస్వస్థత... కావేరీ ఆస్పత్రిలో చేరిక

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (11:32 IST)
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నై ఆళ్వార్ పేటలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన కావేరి ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా... ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య సేవలు కొనసాగుతున్నాయని కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొన్ని రోజులపాటు ఆస్పత్రిలోనే ఆయనకు చికిత్స అందించాల్సి ఉందని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. 
 
కాగా, బుధవారమే తన ఇద్దరు కుమారులైన ఎంకే అళగిరి (పెద్ద కుమారుడు), ఎంకే స్టాలిన్ (చిన్న కుమారుడు)లను గోపాలపురంలోని తన నివాసానికి పిలిపించి.. మంతనాలు జరిపిన విషయం తెల్సిందే. దీంతో కరుణానిధి కుటుంబ సభ్యులతో పాటు... డీఎంకే శ్రేణులు సైతం ఎంతో ఆనందానికి గురయ్యారు. ఈ కలయిక జరిగి కొన్ని గంటలకు గడువకముందే కరుణానిధి తిరిగి ఆస్పత్రిలో చేరడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments