పి.చిదంబరంకు షాక్.. కుమారుడు కార్తీ చిదంబరం అరెస్టు

కేంద్ర ఆర్థిక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆయనను సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు.

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (10:19 IST)
కేంద్ర ఆర్థిక మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆయనను సీబీఐ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయనను... చెన్నై ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుని, తమ కార్యాలయానికి తరలించారు. 
 
యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్ఎక్స్ మీడియా స్కాం చోటుచేసుకుంది. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా నిధులు పొందేందుకు వీలుగా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎప్ఐపీబీ) అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతుల మంజూరులో కార్తీ చిదంబరం చక్రం తిప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. 
 
అలాగే, మనీలాండరింగ్ కేసులో కూడా ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన కార్యాలయంతో పాటు చిదంబరం నివాసంలో కూడా తనిఖీలు చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించడం లేదని పేర్కొంటూ ఆయనను అరెస్టు చేయడం జరిగింది. ఆయనను ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
మరోవైపు, కార్తీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్‌ను ఢిల్లీ కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. ఈడీ అధికారులు భాస్కర రామన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా స్పెషల్ జడ్జ్ ఎన్కే మల్హోత్రా ఆయనను కస్టడీకి తరలిస్తూ తీర్పును వెలువరించారు. వెంటనే అక్కడ నుంచి ఆయనను తీహార్ జైలుకు పోలీసులు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments