Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్ ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన నరేంద్ర మోడీ.. ఎందుకు?

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (14:42 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి సహకరించినందుకు ఆయన ఈ ధన్యవాదాలు తెలిపారు. 
 
ఈ కర్తార్‌పూర్ కారిడార్‌ను పంజాబ్ ప్రభుత్వంతో పాటు పాకిస్థాన్, ఎస్.జి.పి.సిలు కలిసి పూర్తి చేశాయి. ఈ కారిడార్ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా దీన్ని ప్రారంభించారు. 
 
ఇందుకోసం ప్రధాని మోడీ పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోధికి వెళ్లారు. అక్కడ డేరా బాబా నానక్‌ను సందర్శించి ఇక్కడి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు (ఐసీపీ)ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'గురుబనీని ప్రపంచంలోని పలు భాషల్లోకి తర్జుమా చేస్తున్నాం. ఈ పనికి చొరవతీసుకున్న యునెస్కోకి కృతజ్ఞతలు అని చెప్పారు. 
 
అలాగే, దేశంలో గురు నానక్ దేవ్‌కి సంబంధించిన అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. అమృత్‌సర్, కేశ్‌ఘర్, ఆనంద్‌పూర్, డామ్‌డమ, పాట్నా, నాందేడ్‌లలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతూ రైల్వేశాఖ కొత్త రైళ్లను నడపనున్నట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments