Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త.. పిల్లలకు విషమిచ్చి...

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:55 IST)
కట్టుకున్న భార్య భౌతికంగా దూరంకావడాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. దీంతో తన నలుగురు పిల్లలతో పాటు.. తాను కూడా విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా బోరగల్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన గోపాల్‌ అనే వ్యక్తి భార్య జయ (42) జులై 6న బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా కన్నుమూశారు. అప్పటినుంచి మనస్తాపానికి గురైన గోపాల్‌ శుక్రవారం పిల్లలతో పాటు తానూ విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను ఇంటి పెద్ద గోపాల్‌ హాదిమని (48), పిల్లలు సౌమ్య(19), శ్వేత(16), సాక్షి (11), సృజన్‌ (8)గా గుర్తించారు. 
 
కాగా, గోపాల్‌ కొంత కాలం కిందటే సైన్యం నుంచి ఉద్యోగ విరమణ చేశారు. సంకేశ్వర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర సీనియర్‌ మంత్రి గోవింద కారజోళ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో బాధలెన్ని ఎదురైనా ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments