Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో కోడికి టిక్కెట్ తీయలేదని రూ. 500 ఫైన్? ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (17:59 IST)
ప్రభుత్వ వాహనాల్లో పెంపుడు జంతువులను తీసుకెళ్లేవారు తప్పనిసరిగా వాటికి కూడా టికెట్ తీసుకోవాల్సిందే. కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మూడు కోళ్లతో మంగుళూర్‌కి వెళ్తున్నాడు.


అయితే కోడికి టిక్కెట్ తీయలేదని సదరు వ్యక్తికి కర్ణాటక ఆర్టీసీ రూ.500 ఫైన్ వేసింది. కర్ణాటక ఆర్టీసీ బస్సులో పక్షులు, జంతువులను తీసుకువెళ్లాల్సి వస్తే, విధిగా వాటికి అర టికెట్ తీసుకోవాలన్న నిబంధన ఉంది. 
 
ఈ విషయం తెలియని ఆ వ్యక్తి మూడు కోళ్లను తీసుకుని మంగళూరు వెళ్లే బస్సు ఎక్కాడు. కేవలం తనకు మాత్రం టిక్కెట్ తీసుకున్నాడు గానీ, కోళ్ల సంగతి చెప్పలేదు. అనుకోకుండా ఆర్టీసీ చెకింగ్ డిపార్ట్‌మెంట్ వారు టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి వచ్చారు. 
 
ఆ వ్యక్తి తాను తీసుకున్న టిక్కెట్‌ను మాత్రమే చూపాడు, అయితే కోళ్ల సంగతి ఏమిటంటూ వారు ప్రశ్నించారు. దాంతో అతడికి ఏమి చేయాలో అర్థం కాలేదు. చెకింగ్ డిపార్ట్‌మెంట్ వారు ఫైన్ విధించారు. దాంతో ఆ వ్యక్తి ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments