Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితుడిని పెళ్లి చేసుకుంది.. అల్లుడితో గర్భవతిగా ఇంటికొచ్చింది.. అంతే సజీవదహనం చేసేసారు..

దేశంలో పరువు హత్యల సంఖ్య పెరుగుతూనే వుంది. ఓ దళితుడిని వివాహం చేసుకుందని.. తద్వారా పరువు పోయిందని భావించిన కుటుంబసభ్యులు గర్భిణీ అయిన కుమార్తెను సజీవదహనం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌ల

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (14:59 IST)
దేశంలో పరువు హత్యల సంఖ్య పెరుగుతూనే వుంది. ఓ దళితుడిని వివాహం చేసుకుందని.. తద్వారా పరువు పోయిందని భావించిన కుటుంబసభ్యులు  గర్భిణీ అయిన కుమార్తెను సజీవదహనం చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో చోటుచేసుతుంది. వివరాల్లోకి వెళితే.. బీజాపూర్ కి చెందిన ముస్లిం యువతి పేరు భాను బేగం. అదే జిల్లాకు చెందిన శరణప్ప అనే దళిత యువకుని ప్రేమలో పడింది. 
 
పెద్దలు అంగీకరించకపోవడంతో వాళ్ళిద్దరూ గోవాకు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో బేగం గర్భం దాల్చింది. తమ ప్రేమను ఇప్పటికైనా ఇరు కుటుంబాలు అర్థం చేసుకుంటారనే ఆశతో.. బేగం తన భర్తతో కలిసి బీజాపూర్ వెళ్ళింది. వారిని చూసి ఆగ్రహించిన బేగం తల్లిదండ్రులు, శరణప్పను వదిలివేయాలని తమ కూతురికి చెప్పారు. అందుకు, ఆమె ఒప్పుకోలేదు. ఈ క్రమంలో శరణప్పపై బేగం కుటుంబసభ్యులు దాడి చేశారు. 
 
వారి బారి నుంచి తప్పించుకుని బయటపడ్డ శరణప్ప, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శరణప్ప పోలీసులతో సంఘటనాస్థలానికి వచ్చేలోపే.. గర్భవతి అనే దయ కూడా లేకుండా.. ఆమె కుటుంబీకులు సజీవదహనం చేశారు. ఈ దారుణానికి పాల్పడ్డ భాను బేగం కుటుంబసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. భాను బేగంను కాపాడేందుకు శరణప్ప చేసిన ఫలితాలు విఫలమయ్యాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం