Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికూర కోసం తండ్రీకొడుకుల డిష్యూం డిష్యూం.. కుమారుడు హతం

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (13:35 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కోడికూర కోసం తండ్రీ కొడుకులు గొడవపడ్డారు. దీంతో క్షణికావేశంలో కుమారుడిని తండ్రి కర్రతో కొట్టడంతో చనిపోయాడు. కుమారుడు ఇంటికి వచ్చేలోపు కోడికూరను తండ్రి తినేశాడు. దీంతో ఆగ్రహంచిన కుమారుడు... తండ్రితో గొడవకు దిగడంతో ఈ దారుణం జరిగింది.

తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా సునీయా తాలూకా గుత్తికర్ గ్రామానికి షీనా, శివరామన్ అనే తండ్రీ కుమారులు ఉన్నారు. మంగళవారం ఇంట్లో వండిన కోడికూరను షీనా తినేశాడు. ఆ తర్వాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్ తెలిసి ఆగ్రహంతో తండ్రితో గొడవపడ్డారు.

ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా తయారైంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్‌‌ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శివరామన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారితీసింది.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments