Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో మహిళలు మాయమైపోతున్నారు... ఎందుకు?

కర్ణాటకలో మహిళలు మాయమవుతున్నారు. ఇలా అదృశ్యమవుతున్న మహిళలు వ్యభిచారగృహాల్లో మగ్గిపోతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కర్ణాటక రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా... వ్యభిచార గృహాలకు విక్రయం... కిడ్నాప్‌ల పర

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (09:41 IST)
కర్ణాటకలో మహిళలు మాయమవుతున్నారు. ఇలా అదృశ్యమవుతున్న మహిళలు వ్యభిచారగృహాల్లో మగ్గిపోతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కర్ణాటక రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా... వ్యభిచార గృహాలకు విక్రయం... కిడ్నాప్‌ల పర్వం అధికంగా సాగుతున్నట్టు తేలింది. 
 
దీనికి నిదర్శనం 2014 నుంచి 2017 మే నెల వరకు ఈ రాష్ట్రంలో 21,053 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆ రాష్ట్ర పోలీసు రికార్డులే వెల్లడించడం సంచలనం రేపింది. అదృశ్యమైన వారిలో 17,777 మంది మహిళలను వివిధ ప్రాంతాల్లో పోలీసులకు దొరికారు. 2014వ సంవత్సరంలో 5,989 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేసులు నమోదైనాయి. 2016వ సంవత్సరంలో అదృశ్యమైన మహిళల సంఖ్య 6,316కు పెరిగింది. 
 
కిడ్నాప్‌లకు గురవుతున్న మహిళలు ఎక్కువగా వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని సాక్షాత్తూ కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలోనే అంగీకరించారు. పేద మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి వారిని తీసుకెళ్లి వ్యభిచారవృత్తిలో దించుతున్నారని తేలింది. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేసినా మహిళల అదృశ్యానికి తెరపడటం లేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments