Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో మహిళలు మాయమైపోతున్నారు... ఎందుకు?

కర్ణాటకలో మహిళలు మాయమవుతున్నారు. ఇలా అదృశ్యమవుతున్న మహిళలు వ్యభిచారగృహాల్లో మగ్గిపోతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కర్ణాటక రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా... వ్యభిచార గృహాలకు విక్రయం... కిడ్నాప్‌ల పర

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (09:41 IST)
కర్ణాటకలో మహిళలు మాయమవుతున్నారు. ఇలా అదృశ్యమవుతున్న మహిళలు వ్యభిచారగృహాల్లో మగ్గిపోతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కర్ణాటక రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణా... వ్యభిచార గృహాలకు విక్రయం... కిడ్నాప్‌ల పర్వం అధికంగా సాగుతున్నట్టు తేలింది. 
 
దీనికి నిదర్శనం 2014 నుంచి 2017 మే నెల వరకు ఈ రాష్ట్రంలో 21,053 మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆ రాష్ట్ర పోలీసు రికార్డులే వెల్లడించడం సంచలనం రేపింది. అదృశ్యమైన వారిలో 17,777 మంది మహిళలను వివిధ ప్రాంతాల్లో పోలీసులకు దొరికారు. 2014వ సంవత్సరంలో 5,989 మంది మహిళలు అదృశ్యమయ్యారని కేసులు నమోదైనాయి. 2016వ సంవత్సరంలో అదృశ్యమైన మహిళల సంఖ్య 6,316కు పెరిగింది. 
 
కిడ్నాప్‌లకు గురవుతున్న మహిళలు ఎక్కువగా వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని సాక్షాత్తూ కర్ణాటక రాష్ట్ర హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలోనే అంగీకరించారు. పేద మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి వారిని తీసుకెళ్లి వ్యభిచారవృత్తిలో దించుతున్నారని తేలింది. మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేసినా మహిళల అదృశ్యానికి తెరపడటం లేదు. 

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments