Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుల కోసం ఆరాటం.. యువతి టిక్‌టాక్ - స్పందించిన కర్నాటక సీఎం

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (10:55 IST)
తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని, లాక్‌డౌన్ కారణంగా బయటకెళ్లి మందులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. సాయం చేయండంటూ ఓ యువతి సెల్ఫీ వీడియో చేసి, దాన్ని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప దృష్టికెళ్లింది. దీంతో ఆయన తక్షణం స్పందించి అధికారులను ఆదేశించగా, అధికారులు ఇంటికెళ్లి నెల రోజులకు సరిపడ మందులు సమకూర్చారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా రాయదుర్గ తాలూకా, నరసాపుర గ్రామానికి చెందిన శేఖవ్వ అనే మహిళ రెండు కిడ్నీలూ చెడిపోయాయి. దీంతో ఆమె భర్త ఓ కిడ్నీని దానం ఇచ్చారు. జనవరిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆపై ఆమె మందులు వాడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. 
 
అయితే, కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఫలితంగా గత 20 రోజులు శాఖవ్వకు కావాల్సిన మందులు దొరకని పరిస్థితి ఏర్పడటంతో, ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె కుమార్తె పవిత్ర, తల్లి బాధను చెబుతూ, టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో వైరల్ అయి, యడియూరప్పను చేరగా, ఆయన సూచనతో, జిల్లా అధికారులు నిన్న శాఖవ్వ ఇంటికి వెళ్లారు. నెల రోజులకు సరిపడా మందులను అందించారు. మరేదైనా సమస్య ఏర్పడితే, తమకు తెలియజేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments