Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహమైన కొన్ని గంటల్లోనే వధువు మృతి.. కర్ణాటకలో దారుణం

Webdunia
శనివారం, 3 జులై 2021 (11:10 IST)
వివాహమైన కొన్ని గంటల్లోనే వధువు ప్రాణాలు కోల్పోయింది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వధువును మృత్యువు కబళించిన ఈ దుర్ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా సింధగి తాలూకా బి.కె.యలగల్ల గ్రామంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని రాణి (26)గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో పెండ్లి కొడుకు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 
 
పెండ్లి మంటపం నుంచి బంధువులతో కలిసి క్రూసర్‌ వాహనంలో నవ దంపతులు శుక్రవారం ఉదయం కూకటనూరు గ్రామానికి దైవదర్శనం కోసం వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టెంపో ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. నవ వధువు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రులు సింధగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సింధగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments