Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన బాలిక...

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (09:21 IST)
కర్నాటక రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. టీచర్‌కు నోటు పుస్తకం చూపిస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిందో బాలిక. తరగతి గదిలోనే ఆ బాలిక తుదిశ్వాస విడవడం సహచర విద్యార్థులు బోరున విలపించారు. ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇలా మృత్యువాత పడుతున్నవారిలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పోయింది. తాజాగా మూడో తరగతి చదువుతున్న బాలిక గుండెపోటుతో చనిపోవడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. కర్ణాటక, చామరాజనగర్ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఎనిమిదేళ్ల తేజస్విని మూడో తరగతి చదువుతోంది. సోమవారం తరగతి గదిలో టీచర్‌కు నోట్‌‍బుక్ చూపిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని జేఎస్ఎస్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.
 
కాగా, గత నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్లో ఆటలు ప్రాక్టీస్ చేస్తుండగా నాలుగేళ్ల కుర్రాడు గుండెపోటుతో కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటకే బాలుడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
అంతకుముందు సెప్టెంబరు నెలలో అదే రాష్ట్రంలోని లక్నోలో 9 ఏళ్ల బాలిక పాఠశాల క్రీడా మైదానంలో ఆడుకుంటూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. కాగా, కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగినట్టు వోకార్డ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గత రెండు నెలలుగా 15 నుంచి 20 శాతం అధికంగా ఇలాంటి కేసులు వస్తున్నట్టు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments