Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ నాయకుడితో వివాహేతర సంబంధం.. 150 సవర్ల బంగారంతో జంప్

రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యాపారి భార్య.. ఇంట్లోని 150 సవర్ల బంగారు నగలను దోచేసుకుని ప్రియుడితో జంప్ అయ్యింది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో కలకలం రేపింది.

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:31 IST)
రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యాపారి భార్య.. ఇంట్లోని 150 సవర్ల బంగారు నగలను దోచేసుకుని ప్రియుడితో జంప్ అయ్యింది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మార్తాండం ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి (50) ఫైనాన్స్ కంపెనీని నిర్వహిస్తుండగా, అతనికి భార్య (40), ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరింటి పక్కనే వివాహమై భార్యా, పిల్లలున్న ఓ రాజకీయ పార్టీ ప్రముఖుడు నివాసం ఉంటున్నాడు.
 
వీరిద్దరి మధ్య వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన వ్యాపారి వారిని మందలించినా ఫలితం లేకపోయింది. 
 
ఈ క్రమంలో బుధవారం నాడు తన ఇంట్లోని 150 సవర్ల బంగారం నగలతో ఆమె అదృశ్యం అయింది. తన ప్రియుడితో కలసి ఆమె పారిపోయినట్టు విచారణలో వెల్లడికాగా, వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments