Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా కారుకూతలతో మాకు సంబంధం లేదు : బీజేపీ - యూ టర్న్ తీసుకున్న బాలీవుడ్ నటి

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (12:44 IST)
సాగు చట్టాలను వెనక్కి తీసుకుని రావాలంటూ బాలీవుడ్ నటి, లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్ చేస్తున్న వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జయవీర్ షెర్గిల్ అన్నారు. ఇదేవిషయంపై జయవీర్ మాట్లాడుతూ, కంగనా రనౌత్ చేస్తున్న నిరాధారమైన అర్థంపర్థం లేని వ్యాఖ్యలన్నారు. 'సిక్కు సామాజికవర్గం, పంజాబ్ రైతులపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా తర్కవిరుద్ధం. పంజాబ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషికి కంగన తీరు విఘాతం కలిగిస్తోంది' అని ఆయన స్పష్టం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన కంగనా తీరును తీవ్రంగా ఎండగట్టారు. సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని కంగన చెప్పడాన్ని తప్పుబట్టారు. 'కంగనా కారుకూతలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యం' అని దుయ్యబట్టారు. సొంత పార్టీ బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుండడంతో కంగన నష్టనివారణ చర్యలను ప్రారం భించారు. 'నా వ్యాఖ్యలపై భేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. ఇకపై నేను పార్టీ అభిప్రాయాల మేరకు మాట్లాడతాను' అంటూ ఓ ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ మరో అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కూడా.. 'కంగన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. సాగు చట్టాలపై ఆమె మాటలు బీజేపీ విధానాన్ని ప్రతిబింబించబోవు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, కంగనా వ్యాఖ్యలపై ఏఐ 'కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. 750 మంది రైతులు చనిపోయిన తర్వాత కూడా రైతు వ్యతిరేక బీజేపీ, మోడీ ప్రభుత్వంలో మార్పురాలేదు" అన్నారు. హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రధాని మోడీ కూడా పార్లమెంట్ సాక్షిగా రైతులను ఆందోళన జీవులు, పరాన్నజీవులు అన్న విషయాన్ని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments