Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కమల్‌నాథ్‌కే.. రాజస్థాన్ ఎవరికో?

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:30 IST)
సస్పెన్స్‌కు తెరపడింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కమల్‌నాథ్‌ ఎంపికయ్యారు. సీఎం రేసులో చివరివరకు పోటీలో నిలచిన యువనేత జ్యోతిరాదిత్య సింథియాకు చుక్కెదురైంది. అనుభవంతో పాటు యువతరం మధ్య జరిగిన రసవత్తర పోరులో కాంగ్రెస్ అధిష్టానం అనుభవానికే పెద్దపీట వేసింది. 
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం కమల్‌నాథ్, యువనేత జ్యోతిరాధిత్య సింథియాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గురువారం రోజంతా తీవ్ర తర్జన భర్జనల తర్వాత ఎంపీ సీఎంగా కమల్‌నాథ్ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. 
 
నిజానికి భోపాల్‌లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రిగా ఎవరికి అవకాశం కల్పించాలన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధిష్టాన పరిశీలకులుగా సీనియర్లు ఏకే ఆంటోనీ, దిగ్విజయ్ సింగ్, శోభా ఓజా తదితరులు పాల్గొన్నారు. 
 
సీఎల్పీ భేటీ తర్వాత కమల్‌నాథ్ పేరును మధ్యప్రదేశ్ సీఎంగా అధికారికంగా ప్రకటించారు. అదేసమయంలో డిప్యూటీ సీఎం కూడా ఎవరూ ఉండబోరని స్పష్టంచేసింది. మొన్నటి ఎన్నికల్లో చింద్వారా నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ పోటీచేసి గెలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

పవన్ కళ్యాణ్ చిత్రం పురుష టైటిల్ పోస్టర్‌ రిలీజ్ చేసిన గౌతమ్ తిన్ననూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments