Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో మేం ఐదుగురం పంచపాండవులం.. కౌరవుల్ని ఎదుర్కొంటాం: లక్ష్మణ్

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2016 (13:25 IST)
బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు, ఓ ఎమ్మెల్సీ ఉన్నారని గుర్తు చేసిన లక్ష్మణ్.. అసెంబ్లీ మేం ఐదుగురం పంచపాండవులని అభివర్ణించారు. పంచపాండవుల తరహాలో ధర్మం పక్షనా నిలబడతామన్నారు. 
 
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికార పార్టీ కౌరవ సేనను తయారు చేస్తోంది. ఆ కౌరవ సేనను పాండవుల్లా ఎదుర్కొంటామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్టీ సీనియర్‌ నేతల సలహాలు తీసుకుంటూ తెలంగాణలో బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేస్తామన్నారు. 
 
ప్రజల పక్షాన ఉండి పోరాడతామని, తెలంగాణ అసెంబ్లీకి బీజేపీ అజెండా అనే నినాదంతో ముందుకు వెళతామని చెప్పారు. ‘‘ఉద్యమ కాలంలో, ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ, వాటి అమలుకు ప్రయత్నం చేయడం లేదని వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments