Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు తదుపరి కొత్త చీఫ్ జస్టీస్‌గా సంజీవ్ ఖన్నా - నేపథ్యం ఏంటి?

ఠాగూర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (06:13 IST)
భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఆయన ఈ నెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతమున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం వచ్చే నెల 11 తేదీన ముగియనుంది. ఆ తర్వాత కొత్త చీఫ్ జస్టిస్‌గా సంజీవ్‌ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
సంజీవ్ ఖన్నా నవంబర్ 11వ తేదీన సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ వెల్లడించారు. ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబరు 10వ తేదీన ముగియనుంది. దీంతో జస్టిస్ ఖన్నా పేరును చంద్రచూడ్ సిఫార్సు చేయగా... రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో వచ్చే నెల 11వ తేదీన సుప్రీంకోర్టు 51వ సీజేఐగా జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు.
 
జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13వ తేదీ వరకు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. తీసా జారీ జిల్లా కోర్టు, హైకోర్టు, ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే మాటరాలేదు: విజయ్ దేవరకొండ

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్

పట్టలేని ఆనందంలో రేణూ దేశాయ్ .. ఎందుకో తెలుసా?

సాయి దుర్గా తేజ్ 18వ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరకర్తగా ఎంట్రీ

సారంగపాణిలో ప్రణయ గీతంలో అలరిస్తున్న ప్రియదర్శి, రూపా కొడువాయుర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments