Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేత అవధేష్ కుమారులు అంత పనిచేశారా? ఎయిర్‌ హోస్టెస్‌పై?

బీహార్ మాజీ స్పీకర్, బీజేపీ నేత అవధేష్ నారాయణ్‌ ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసుకుంది. ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మడిగా లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలపై అవధేష్‌ కుమారులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే

Webdunia
ఆదివారం, 20 మే 2018 (13:47 IST)
బీహార్ మాజీ స్పీకర్, బీజేపీ నేత అవధేష్ నారాయణ్‌ ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేసుకుంది. ఎయిర్‌హోస్టెస్‌పై ఉమ్మడిగా లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలపై అవధేష్‌ కుమారులపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే, ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్‌లో బాధితురాలు పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులు పట్నాలో ఉంటారు. 
 
తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చూసి వెళ్లేందుకు ఆమె పట్నాకు వచ్చింది. అవధేష్ కుమారుడు సుషాంత్ రంజన్‌కు ఎయిర్ హోస్టెస్‌కు ముందే పరిచయం వుంది. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ పరిచయంతో డిన్నర్‌కు ఆహ్వానించాడు సుశాంత్. వారు చెప్పిన చోటకు ఆమె వెళ్లింది. అక్కడే సుశాంత్ సోదరుడు ప్రశాంత్ కూడా ఉన్నాడు.
 
ఇద్దరూ కలిసి ఆమెను బంధించి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తండ్రికి చెందిన గెస్ట్ హౌస్‌లో ఆమెను బంధించి, వెళ్లిపోగా, అక్కడి ఉద్యోగుల సాయంతో బయటపడ్డ ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత కేసు నమోదు చేసుకునేందుకు వెనుకాడిన పోలీసులు, ఆపై 24 గంటల తరువాత కేసు పెట్టి దర్యాఫ్తు ప్రారంభించారు. కానీ అవధేష్ మాత్రం బాధితురాలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. ఆమె చేసే ఆరోపణల్లో నిజం లేదంటున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం