Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇస్తా.. ఓ మంత్రికి కాదు.. గొప్ప మనసున్న మహిళకు.. జోధ్‌పూర్ రైతు

కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానం చేసేందుకు జోధ్‌పూర్‌కు చెందిన ఓ రైతు ముందుకు వచ్చారు. అయితే, సుష్మా ఓ మంత్రిగా ఉండ

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (17:48 IST)
కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానం చేసేందుకు జోధ్‌పూర్‌కు చెందిన ఓ రైతు ముందుకు వచ్చారు. అయితే, సుష్మా ఓ మంత్రిగా ఉండటం వల్లే తాను కిడ్నీ ఇవ్వడం లేదనీ, ఆమెకున్న గొప్ప మనసును చూసి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చినట్టు ఆయన ప్రకటించారు. 
 
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సుష్మా స్వరాజ్‌కు ప్రస్తుతం ఎయిమ్స్‌ వైద్యశాలలో డయాలిసిస్‌ చేస్తున్నారు. కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించడంతో ఆమెపై అభిమానం ఉన్న పలువురు కిడ్నీ దానం చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారిలో జోధ్‌పూర్‌కు సమీపంలోని ఎకలఖోరి అనే ప్రాంతానికి చెందిన రైతు కూడా ఉన్నారు. అతని పేరు వైషేక్‌ విష్ణోయి
 
'ఆపదలో ఉన్నవారు సహాయం కావాలంటే ఆమె వెంటనే స్పందిస్తారు. నిశ్శబ్దంగా పనిచేసుకుపోతారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ఎంతో మంది కార్మికులను రక్షించే విషయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నిబద్ధత, సహాయం చేసే గొప్ప మనసు ఆమె సొంతం. అందుకే ఆమెకు నా కిడ్నీ దానం చేస్తా..' అని ఆయన చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments