Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేకేఎన్‌పీపీ వ్యవస్థాపకుడు భీంసింగ్ ఇకలేరు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (08:57 IST)
జమ్మూకాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్‌పీపీ) వ్యవస్థాపకుడు భీంసింగ్ కన్నుమూశారు. ఈయనకు 81 సంవత్సరాలు. ఆయన గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. దీంతో జమ్మూకాశ్మీర్‌లోని జీఎంసీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన ఒక రచయితగా, మానవహక్కుల నేతగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో సీనియర్ కార్యవర్గ సభ్యుడుగా సుపరిచితుడు. 
 
కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భీంసింగ్ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 1982లో జమ్మూకాశ్మీర్‌ నేషనల్ పాంథర్స్ పార్టీని స్థాపించారు. జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీకి 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ నాలుగు స్థానాల్లో గెలిచింది. 
 
ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా అధినేత యాసర్ అరాఫత్, క్యూబా విప్లవ కెరటం ఫిడెల్ కాస్ట్రో, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్, లిబియా నియంత గడాఫీతో భీంసింగ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. కాగా, ఈయన భార్య, కుమారుడు ఉన్నారు. వీరు ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments