Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్యచేసి 50 ముక్కలుగా నరికాడు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (15:54 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో తన భార్యను ఓ భర్త హత్య చేసి 50 ముక్కలుగా నరికిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. దిల్సర్ అన్సారీ జార్ఖండ్‌లోని సకీబ్‌గంజ్ జిల్లాలోని బోరియో నివాసి. అతనికి అప్పటికే వివాహమై, ఆ ప్రాంతానికి చెందిన రూబికా బగాదిన్ అనే 22 ఏళ్ల గిరిజన యువతితో వివాహేతర సంబంధం ఉంది. 
 
రెండేళ్లుగా ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు. ఈ కేసులో రూబికా కనిపించడం లేదని దిల్సర్ అన్సారీ ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూబికా తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అన్సారీపై వారికి అనుమానం కలిగింది. 
 
ఇదిలా వుంటే సంతాలి గ్రామంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రంలో కుక్క మానవ శరీర భాగాన్ని తినేస్తున్నట్లు స్థానికులు చూశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఆ భవనంలో 12 శరీర భాగాలు కనిపించాయి. విచారణలో అది రూబికా శరీర భాగాలని తేలింది. 
 
దీంతో అన్సారీపై అనుమానం వచ్చి పోలీసులు తీవ్రంగా విచారించగా.. రూబికాను హత్య చేసి 50 ముక్కలుగా నరికి తానేనని అన్సారీ అంగీకరించాడు. అన్సారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments