Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్యచేసి 50 ముక్కలుగా నరికాడు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (15:54 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో తన భార్యను ఓ భర్త హత్య చేసి 50 ముక్కలుగా నరికిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. దిల్సర్ అన్సారీ జార్ఖండ్‌లోని సకీబ్‌గంజ్ జిల్లాలోని బోరియో నివాసి. అతనికి అప్పటికే వివాహమై, ఆ ప్రాంతానికి చెందిన రూబికా బగాదిన్ అనే 22 ఏళ్ల గిరిజన యువతితో వివాహేతర సంబంధం ఉంది. 
 
రెండేళ్లుగా ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు. ఈ కేసులో రూబికా కనిపించడం లేదని దిల్సర్ అన్సారీ ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూబికా తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అన్సారీపై వారికి అనుమానం కలిగింది. 
 
ఇదిలా వుంటే సంతాలి గ్రామంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రంలో కుక్క మానవ శరీర భాగాన్ని తినేస్తున్నట్లు స్థానికులు చూశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఆ భవనంలో 12 శరీర భాగాలు కనిపించాయి. విచారణలో అది రూబికా శరీర భాగాలని తేలింది. 
 
దీంతో అన్సారీపై అనుమానం వచ్చి పోలీసులు తీవ్రంగా విచారించగా.. రూబికాను హత్య చేసి 50 ముక్కలుగా నరికి తానేనని అన్సారీ అంగీకరించాడు. అన్సారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments