Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్యచేసి 50 ముక్కలుగా నరికాడు.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (15:54 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో తన భార్యను ఓ భర్త హత్య చేసి 50 ముక్కలుగా నరికిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. దిల్సర్ అన్సారీ జార్ఖండ్‌లోని సకీబ్‌గంజ్ జిల్లాలోని బోరియో నివాసి. అతనికి అప్పటికే వివాహమై, ఆ ప్రాంతానికి చెందిన రూబికా బగాదిన్ అనే 22 ఏళ్ల గిరిజన యువతితో వివాహేతర సంబంధం ఉంది. 
 
రెండేళ్లుగా ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు. ఈ కేసులో రూబికా కనిపించడం లేదని దిల్సర్ అన్సారీ ఇటీవల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూబికా తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అన్సారీపై వారికి అనుమానం కలిగింది. 
 
ఇదిలా వుంటే సంతాలి గ్రామంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రంలో కుక్క మానవ శరీర భాగాన్ని తినేస్తున్నట్లు స్థానికులు చూశారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఆ భవనంలో 12 శరీర భాగాలు కనిపించాయి. విచారణలో అది రూబికా శరీర భాగాలని తేలింది. 
 
దీంతో అన్సారీపై అనుమానం వచ్చి పోలీసులు తీవ్రంగా విచారించగా.. రూబికాను హత్య చేసి 50 ముక్కలుగా నరికి తానేనని అన్సారీ అంగీకరించాడు. అన్సారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments