ప్రేమించలేని నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతక ప్రేమికుడు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (09:24 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ యువకుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. యువతి నిద్రపోతున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్కండ్ రాష్ట్రంలోని దుమ్కాలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న అంకిత(19)ను షారుక్‌ హుస్సేన్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తూ వచ్చాడు. అందుకు అంకిత అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న హుస్సేన్ ఈ నెల 25వ తేదీ వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 
 
ఫలితంగా ఆమె శరీరం 90 శాతం మేరకు కాలిపోయింది. రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి దాటాక (ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు) అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడంతో దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న హుస్సేన్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments