Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేని నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతక ప్రేమికుడు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (09:24 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ యువకుడు కిరాతక చర్యకు పాల్పడ్డాడు. యువతి నిద్రపోతున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జార్కండ్ రాష్ట్రంలోని దుమ్కాలో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న అంకిత(19)ను షారుక్‌ హుస్సేన్‌ అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తూ వచ్చాడు. అందుకు అంకిత అంగీకరించలేదు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న హుస్సేన్ ఈ నెల 25వ తేదీ వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 
 
ఫలితంగా ఆమె శరీరం 90 శాతం మేరకు కాలిపోయింది. రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి దాటాక (ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు) అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడంతో దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న హుస్సేన్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments