Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిన్ను ప్రేమిస్తే.. వేరే అబ్బాయితో సన్నిహితంగా వుంటావా?

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో సన్నిహితంగా వుండటాన్ని ఓర్చుకోలేని ఓ వ్యక్తి.. ఆమెపై కక్ష పెంచుతుని దారుణంగా హతామార్చాడు. ఈ ఘటన

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (10:55 IST)
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో నేరాల సంఖ్య పెరిగిపోతుంది. తాను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో సన్నిహితంగా వుండటాన్ని ఓర్చుకోలేని ఓ వ్యక్తి.. ఆమెపై కక్ష పెంచుతుని దారుణంగా హతామార్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే, నిజాంనగర్ ప్రాంత వాసి రిజ్వాన్‌ఖాన్ (20) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గత 11 నెలలుగా ప్రేమలో వున్నాడు. తన ప్రేయసి మరో యువకుడితో స్నేహంగా ఉంటుందని తెలిసిన రిజ్వాన్ ఖాన్ ప్రేయసితో గొడవపడ్డాడు. 
 
అనంతరం కత్తి తీసుకొని ప్రియురాలి మెడ కోసి రెండు ముక్కలు చేశాడు. ప్రేయసి శవాన్ని రెండు బ్యాగుల్లో ప్యాక్ చేసి.. బారాపుల్లా ఫ్లై ఓవర్ కింద వున్న లాలాలజపతిరాయ్ మార్గ్ మురుగుకాల్వలో పడేశాడు. అనంతరం రిజ్వాన్ నేరుగా పోలీసుస్టేషనుకు వెళ్లి తాను తన ప్రేయసిని హత్య చేశానని లొంగిపోయాడు. నిరుద్యోగి అయిన రిజ్వాన్ తల్లీ, సోదరులతో కలిసి ఉంటున్నాడని  పోలీసులు తెలిపారు. 
 
ఇంకా తన ప్రేయసి మరో యువకుడితో సన్నిహితంగా వుండటం తనకు నచ్చలేదని అందుకే చంపేశానని పోలీసులతో నిందితుడు చెప్పాడు. పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments