Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి జయప్రదను తక్షణం అరెస్టు చేయండి..

ఠాగూర్
మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (09:34 IST)
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు మరో షాక్ తగిలిగింది. ఆమె ఇప్పటికే ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే. తాజాగా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ రాంపుర్​ జిల్లా ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తరపున రాంపుర్​ నుంచి ఎంపీగా జయప్రద పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదైవున్నాయి. 
 
అయితే, ఈ కేసుల విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో సాగుతుంది. ఈ విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. అంతకుముందు కూడా నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి, ఆమెను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్టు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులు హాజరుపరచాలంటూ రాంపూర్ ఎస్పీని ఆదేశిస్తూ, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. 
 
కాగా, సినిమా తర్వాత తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయప్రద.. టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రలోని సమాజ్ వాదీ పార్టీలో చేరి, రాంపుర్​ లోక్​సభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు ఆమె రాంపుర్​ ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరి, రాంపుర్​ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments