Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సీఎం జయలలిత మృతి కేసు.. వారం రోజులు వాయిదా

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:59 IST)
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుపై విచారణను వారం రోజులు వాయిదా వేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబరు 5న జయలలిత మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో... జయలలిత మృతిపై విచారణ చేపట్టేందుకు మాజీ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఓ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విచారణ పూర్తికాకపోవడంతో కమిషన్‌ను ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. 
 
జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి తరపున సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసు జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణకు అడ్డంకిగా మారిందనే విమర్శలున్నాయి. అపోలో ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ తరపున హాజరైన న్యాయవాదులు, కేసుకు సంబంధించి నలుగురు సాక్షులను విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం కోర్టు వారం రోజులు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments