Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్థంతి తేదీపై సరికొత్త వివాదం!

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (09:34 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్థంతి తేదీపై ఇపుడు సరికొత్త వివాదం నెలకొంది. ఆమె డిసెంబరు 4వ తేదీనే మృతి చెందినట్టు ఆమె మృతిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. దీంతో పలువురు అన్నాడీఎంకే నేతలు డిసెంబరు నాలుగో తేదీనే జయలలిత చిత్ర పటానికి నివాళులు అర్పించారు. 
 
కానీ, గత అన్నాడీఎంకే ప్రభుత్వం జయలలలిత డిసెంబరు 5వ తేదీన చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో జయలలిత మృతి తేదీపై సరికొత్త వివాదం చెలరేగింది. జయ వర్థంతి డిసెంబరు 5 అని ఒకరు, కాదు డిసెంబరు 4నే అని మరో వర్గం నేతలు వాదిస్తున్నరు. 
 
ఈ నేపథ్యంలో జయలలిత మరణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ మాత్రం జయలలిత డిసెంబరు 4వ తేదీన మృతి చెందినట్టు పేర్కొంది. అయితే, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు దీంతో ఏకీభవించడం లేదు. 
 
జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ పేర్కొన్నదాని ప్రకారం జయలలిత డిసెంబరు 4వ తేదీనే మరణించారు. ప్రభుత్వ ఆదేశంతో మార్పు చేయాలని అన్నాడీఎంకే మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన వర్గానికి చెందిన 100 మందితో కలిసి ఆదివారమే మెరీనా తీరంలోని జయలలిత సమాధికి నివాళులు కూడా అర్పించారు. 
 
మరోవైపు, అన్నాడీఎంకే నేతలైన మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి, టీటీవీ దినకరన్, శశికళ వర్గాలు మాత్రం జయలలిత వర్థంతి వేడుకలను డిసెంబరు 5వ తేదీన నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ఆయా వర్గాల నేతలు జయలలిత సమాధికి నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments