Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్థంతి తేదీపై సరికొత్త వివాదం!

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (09:34 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వర్థంతి తేదీపై ఇపుడు సరికొత్త వివాదం నెలకొంది. ఆమె డిసెంబరు 4వ తేదీనే మృతి చెందినట్టు ఆమె మృతిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. దీంతో పలువురు అన్నాడీఎంకే నేతలు డిసెంబరు నాలుగో తేదీనే జయలలిత చిత్ర పటానికి నివాళులు అర్పించారు. 
 
కానీ, గత అన్నాడీఎంకే ప్రభుత్వం జయలలలిత డిసెంబరు 5వ తేదీన చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో జయలలిత మృతి తేదీపై సరికొత్త వివాదం చెలరేగింది. జయ వర్థంతి డిసెంబరు 5 అని ఒకరు, కాదు డిసెంబరు 4నే అని మరో వర్గం నేతలు వాదిస్తున్నరు. 
 
ఈ నేపథ్యంలో జయలలిత మరణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ మాత్రం జయలలిత డిసెంబరు 4వ తేదీన మృతి చెందినట్టు పేర్కొంది. అయితే, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు దీంతో ఏకీభవించడం లేదు. 
 
జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ పేర్కొన్నదాని ప్రకారం జయలలిత డిసెంబరు 4వ తేదీనే మరణించారు. ప్రభుత్వ ఆదేశంతో మార్పు చేయాలని అన్నాడీఎంకే మాజీ ఎంపీ కేసీ పళనిస్వామి డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన వర్గానికి చెందిన 100 మందితో కలిసి ఆదివారమే మెరీనా తీరంలోని జయలలిత సమాధికి నివాళులు కూడా అర్పించారు. 
 
మరోవైపు, అన్నాడీఎంకే నేతలైన మాజీ ముఖ్యమంత్రులు ఓ పన్నీర్ సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి, టీటీవీ దినకరన్, శశికళ వర్గాలు మాత్రం జయలలిత వర్థంతి వేడుకలను డిసెంబరు 5వ తేదీన నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ఆయా వర్గాల నేతలు జయలలిత సమాధికి నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments