Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమాత్రం దానికే జయ పరువు పోయిందా...? మరి ఎందుకలా...?

Webdunia
గురువారం, 31 జులై 2014 (12:15 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన సినిమా జీవితంతోపాటు రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో అధికార పీఠంపై కూర్చున్న జయలలిత డీఎంకే పార్టీని భవిష్యత్తులో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్నట్లుగా అధఃపాతాళానికి తొక్కేశారని చెప్పుకుంటున్నారు. అంత లోతుగా తొక్కేసినప్పటికీ గతంలో అసెంబ్లీలో అవమానించిన డీఎంకే నాయకులను అంత సులభంగా ఆమె వదలదల్చుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
 
అసెంబ్లీలో డీఎంకే సభాపక్ష నాయకుడు ఎంకె స్టాలిన్‌పై అన్నాడీఎంకే అధినేత్రి, పురట్చితలైవి, తమిళనాడు సీఎం జయలలిత పరువునష్టం దావా వేశారు. అసెంబ్లీ వెలుపల తనకు, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు తమిళనాడు సీఎం జయలలిత పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
 
ముఖ్యమంత్రి తరఫున నగర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జగన్ బుధవారం చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ ఏడాది జూలై 22న అసెంబ్లీ నుంచి స్టాలిన్‌తోపాటు ఇతర డిఎంకె ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వెలుపలికి పంపించడం జరిగిందని సిపిపి తన పిటిషన్‌లో తెలిపారు.
 
అసెంబ్లీ వెలుపల విలేకరులతో మాట్లాడిన అనంతరం స్టాలిన్, ఇతర డిఎంకె ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments