Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదనిలయం నుంచి ఖాళీ చేయించండి.. పన్నీర్ ఆదేశాలు.. తట్టా బుట్టా సర్దుకుని చిన్నమ్మ వెళ్ళిపోయారా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళకు ఆరాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చుక్కలు చూపిస్తున్నారు. జయమ్మ మృతికి తర్వాత పోయె

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:28 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న శశికళకు ఆరాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చుక్కలు చూపిస్తున్నారు. జయమ్మ మృతికి తర్వాత పోయెస్ గార్డెన్‌లో మకాం వేసి చక్రం తిప్పుతున్న శశికళను వేద నిలయం నుంచి గెంటేయడానికి పన్నీర్ సెల్వం రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
ఇందులో భాగంగా జయలలితకు ప్రాణమైన చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయం నుంచి శశికళను తరిమికొట్టాలని పన్నీర్ డిసైడైపోయారు. 2016 డిసెంబర్ 5వ తేది జయలలిత మరణించిన తరువాత వేదనిలయంలో శశికళ, మన్నార్ గుడి మాఫియా సభ్యులు మకాం వేశారు. అక్కడి నుంచే శశికళ కూడా అన్నాడీఎంకేలో చక్రం తిప్పారు.
 
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. చివరికి సీఎం కావాలని పన్నీర్ సెల్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆయనతో రాజీనామా చేయించారు. అయితే చిన్నమ్మపై పన్నీరు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అంతటితో ఆగకుండా పోయెస్ గార్డెన్‌లోని వేదనిలయం జయలలిత స్మారక భవనం చేస్తామని ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం శనివారం మధ్యాహ్నం వేదనిలయం ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 
పన్నీర్ సెల్వం నిర్ణయంపై జయలలిత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పన్నీర్ సెల్వం ఆదేశాల నేపథ్యంలో చిన్నమ్మ వేద నిలయం నుంచి వెళ్ళిపోయేందుకు వీలుగా తట్టాబుట్టా సర్దేసుకుని.. గవర్నర్‌తో భేటీ కావాలనే సాకుతో వెళ్ళిపోయారని టాక్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments