కర్నాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహాల జైలులో ఉన్న జయలలిత జైలు అధికారులకు తన సన్నిహితురాలు శశికళను తనతో పాటు ఉంచాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తన మిత్రురాలు శశికళను తనతో పాటే వీవీఐపీ సెల్లో ఉంచాలని ఆమె కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలావుండగా అన్నాడీఎంకే కార్యకర్తలు పలువురు నాయకులు తమ అధినేత్రి జయలలిత ఉన్న పరప్పన జైలు ఎదుట తమ నాయకురాలిని విడుదల చేయాలంటూ మంగళవారం ఆందోళనకు దిగారు.