Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళ ఓ నిశాని... ప్రజలు ఎన్నుకున్న వారే పరిపాలించాలి: దీప

తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు శశికళ నటరాజన్ అర్హులురాలు కాదని ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. పైగా, శశికళ ఓ నిశాని అంటూ ఘాటైన విమర్శలు చేశారు.

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (08:57 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు శశికళ నటరాజన్ అర్హులురాలు కాదని ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. పైగా, శశికళ ఓ నిశాని అంటూ ఘాటైన విమర్శలు చేశారు.
 
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శశికళ సర్వం సిద్ధం చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై దీపతో పాటు.. అన్ని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై దీప స్పందిస్తూ... ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులే రాష్ట్రాన్ని పరిపాలించాలన్నారు. 
 
తనను నమ్మిన వారికి ఏదైనా చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నానన్నారు. ప్రస్తుతం తమిళనాడు ప్రజలు స్వాతంత్య్రం కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులే పరిపాలించాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రజలకు వేరే అభిప్రాయమే లేదన్నారు. 
 
ఇంత వరకు ఓర్చుకున్నామని... ఇక మంచి భవిష్యత్తు కోసం పోరాడుదామని సూచించారు. ప్రజల కోసం బతికే వాళ్లు రాష్ట్రాన్ని పరిపాలించాలని, జయలలిత పేరు మరుగునపడకుండా కాపాడటం తమ కర్తవ్యమని తెలిపారు. తప్పకుండా అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగచైతన్య, సాయిపల్లవి నటించిన తండేల్‌ రివ్యూ

Thandel: తండేల్ ట్విట్టర్ రివ్యూ.. నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు

Pushpa 2: పుష్ప ఫ్యాన్.. మహా కుంభమేళాలో డైలాగులతో ఇరగదీశాడు.. వీడియో వైరల్

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments