Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కాశ్మీర్‌లో పెళ్లి.. 500 మందినే పిలవాలి.. స్వీట్స్, డ్రైఫ్రూట్స్ ఇస్తే?

పెళ్ళిని వైభవంగా అట్టహాసంగా.. గుర్తుండిపోయేలా చేయాలని అందరూ అనుకుంటారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం పెళ్ళిళ్లకు వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. జమ్మూ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:12 IST)
పెళ్ళిని వైభవంగా అట్టహాసంగా.. గుర్తుండిపోయేలా చేయాలని అందరూ అనుకుంటారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం పెళ్ళిళ్లకు వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. జమ్మూ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంపై ఆ రాష్ట్ర సర్కారు పరిమితి విధించింది. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

పెళ్లిళ్ల ఖర్చుకు సంబంధించి లోక్‌సభలో ఇదే తరహా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమ్మాయి పెళ్లిచేసేవారు గరిష్ఠంగా 500 మందిని, అబ్బాయి పెళ్లి చేసేవారు 400 మందినే ఆహ్వానించాలని పేర్కొంది. 
 
ఇక నిశ్చితార్థం వంటి చిన్నపాటి శుభకార్యాలను 100 మంది అతిథుల సమక్షంలో మాత్రమే జరుపుకోవాలని సూచించింది. అంతేకాదు.. లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడంపై, బాణసంచా కాల్చడంపై, ఆహ్వాన పత్రికతో స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి అందించడంపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని వనరులు భారీ పెళ్లిళ్ల పేరిట దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments