Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ కాశ్మీర్‌లో పెళ్లి.. 500 మందినే పిలవాలి.. స్వీట్స్, డ్రైఫ్రూట్స్ ఇస్తే?

పెళ్ళిని వైభవంగా అట్టహాసంగా.. గుర్తుండిపోయేలా చేయాలని అందరూ అనుకుంటారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం పెళ్ళిళ్లకు వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. జమ్మూ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:12 IST)
పెళ్ళిని వైభవంగా అట్టహాసంగా.. గుర్తుండిపోయేలా చేయాలని అందరూ అనుకుంటారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం పెళ్ళిళ్లకు వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. జమ్మూ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంపై ఆ రాష్ట్ర సర్కారు పరిమితి విధించింది. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

పెళ్లిళ్ల ఖర్చుకు సంబంధించి లోక్‌సభలో ఇదే తరహా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమ్మాయి పెళ్లిచేసేవారు గరిష్ఠంగా 500 మందిని, అబ్బాయి పెళ్లి చేసేవారు 400 మందినే ఆహ్వానించాలని పేర్కొంది. 
 
ఇక నిశ్చితార్థం వంటి చిన్నపాటి శుభకార్యాలను 100 మంది అతిథుల సమక్షంలో మాత్రమే జరుపుకోవాలని సూచించింది. అంతేకాదు.. లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడంపై, బాణసంచా కాల్చడంపై, ఆహ్వాన పత్రికతో స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి అందించడంపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని వనరులు భారీ పెళ్లిళ్ల పేరిట దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments