Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులకు లంచమిచ్చి భార్యలు - ప్రియురాళ్లతో ఖైదీల రాసలీలు!

ఠాగూర్
సోమవారం, 26 మే 2025 (18:56 IST)
వైద్య పరీక్షల కోసం జైలు నుంచి ఆస్పత్రికి వెళ్లిన కొందరు ఖైదీలు.. తమకు ఎస్కాట్‌గా పోలీసులకు లంచమిచ్చి.. తమ భార్యలు, ప్రియురాళ్లతో ఏకాంతంగా గడిపిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పోలీసుల అనుమతితో వెళ్లిన ఖైదీలు.. సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో విచారణ జరుపగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జైపూర్ సెంట్రల్ జైలు నుంచి శనివారం రఫీక్ బక్రి, భన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే నలుగురు ఖైదీలను కానిస్టేబుళ్లు వైద్య పరీక్షల కోసం బయటకు తీసుకెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఖైదీలు గార్డులకు ఒక్కొక్కరికీ రూ.5 వేలు చొప్పున లంచం ఇస్తామని, తమను సాయంత్రం వరకు బయట వదిలేయాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించిన కానిస్టేబుళ్లు వారిని వదిలివేశారు. బయటకు వెళ్లిన ఖైదీలు సాయంత్రమైన తిరిగి రాకపోవడంతో అధికారుల వారి కోసం గాలిస్తుండగా, ఓ హోటల్‌లో రఫీక్ తన భార్యతో, భన్వర్ తన మాజీ ప్రియురాలితో ఉన్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
మరో ఇద్దరు ఖైదీలైన అంకిత్, కరణ్ విమానాశ్రయానికి సమీపంలోని ఒక హోటల్‌లో ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారుప. కరణ్‌తో పాటు ఉన్న అతడి బంధువు వద్ద అనేక మంది ఖైదీల ఐడీ కార్డులు, రూ.45 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments