Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సుల్లో వలస కూలీల జర్నీ.. మూడేళ్లలో ఇంటికి చేరుకుంటారు లెండి..?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (16:48 IST)
Abhishek Manu Singhvi
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల విషయంలో కేంద్రం సరైన గ్రౌండ్ వర్క్‌ చేయలేదని ఫైర్ అయ్యారు. వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించడానికి రైళ్లు అయితే బాగుంటుందని తాము సూచించామని, కానీ కేంద్రం బస్సులను ఏర్పాటు చేస్తోందన్నారు. 
 
బస్సుల్లో అయితే వలస కూలీలు ఇళ్లకు చేరుకోవడానికి మూడు సంవత్సరాలు పడుతుందని ఎద్దేవా చేశారు. వీరి రవాణా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం నిధులను కూడా విడుదల చేయడం లేదని, నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగిసే సమయం దగ్గరపడిందని, వలస కార్మికుల అవస్థల గురించి ప్రధాని మోదీకి ఓసారి గుర్తు చేయాలన్నారు. 
 
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం కార్మీకులకు చేసిందేమీ లేదని విమర్శించారు. కార్మికుల విషయంలో కేంద్రం ఏప్రిల్ 29 న విడుదల చేసిన మార్గదర్శకాలు నిర్హేతుకమైనవని, తుగ్లక్ చర్య అని సింఘ్వీ మండిపడ్డారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments