ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా.. అయితే మళ్లీ అప్‌డేట్ చేసుకోవాల్సిందే..

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (11:34 IST)
కేంద్ర ప్రభుత్వం జారీచేసే ఆధార్ కార్డు ఇపుడు ప్రతి ఒక్కరికీ ప్రధాన ఆధారంగా మారింది. అలాంటి ఆధార్ కార్డును తీసుకుని పదేళ్లు దాటిన వారు తమ వివరాలను మళ్లీ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ మేరకు ఆధార్ (ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్) రెగ్యులేషన్ 2016లో కొత్తగా 16ఏ నిబంధనను చేర్చింది. ఈ నిబంధన ప్రకారం ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఇకపై పదేళ్లకోసారి గుర్తింపు కార్డును, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించే కేంద్ గుర్తింపు సమాచార నిధి (సీఐడీఆర్)లో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, చేసుకోవాలన్న నిర్బంధం కూడా లేదు. 
 
ఈ ప్రక్రియ కారణంగా పౌరుల సమాచారం ఎప్పటికపుడు అప్‌డేట్ అవుతుందని యూఐడీఏఐ తెలిపింది. మై ఆధార్ పోర్టల్ లేదంటే సమీపంలోని ఆధార్ కేంద్రం నుంచి ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
ఇదిలావుంటే, దేశంలో ఇప్పటివరకు మొత్తం 134 కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీచేసింది. వీరిలో గత యేడాది మాత్రమే 16 కోట్ల మంది తమ కార్డులను అప్‌డేట్ చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments