Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళను దోషిగా ప్రకటించడం చారిత్రాత్మకం : ఎంకేస్టాలిన్

జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ‘చారిత్రాత్మక’మైనదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభ ప్రతి

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (12:44 IST)
జయలలిత అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా పేర్కొంటూ సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ‘చారిత్రాత్మక’మైనదని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, తమిళనాడు శాసన సభ ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. 
 
తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ విద్యాసాగర్ రావు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 'రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం తర్వాత న్యాయం జరిగింది. ఇది చారిత్రాత్మక తీర్పు' అని పేర్కొన్నారు. ప్రజాజీవితంలో రాజకీయ నేతలు ఎలాంటి ప్రవర్తనతో నడుచుకోవాలో సుప్రీం తీర్పు మార్గనిర్దేశనం చేసిందన్నారు. 
 
"అవినీతి, అక్రమాలకు పాల్పడే నేతలెవ్వరూ ఎవరూ తప్పించుకోలేరని ఈ తీర్పు చాటిచెప్పింది. ప్రజాజీవితంలో నిజాయితీ చాలా అవసరం. రాజకీయ నేతలందరికీ ఇదో గొప్ప గుణపాఠం" అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి పీఠానికి జరిగే బలపరీక్షలో డీఎంకే వైఖరి ఏమిటని కోరగా... 'డీఎంకే ఎల్లప్పుడూ దేశ ప్రయోజనం వైపే నిలబడుతుంది' అని సమాధానమిచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments