Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న ఐటీ సోదాలు... శశికళ వంద బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌లతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఐదో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు.

Webdunia
సోమవారం, 13 నవంబరు 2017 (12:36 IST)
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌లతో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఐదో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అంటే, గత ఐదు రోజులుగా మన్నార్గుడి మాఫియాను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 
 
పెద్ద నోట్ల రద్దు సమయంలో వీరంతా భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడటమే కాకుండా, భారీ మొత్తంలో పన్ను ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు సాగుతున్న విషయం తెల్సిందే. ఈ దాడుల్లో శశికళకు చెందిన సంస్థల్లో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 20 డొల్ల కంపెనీలకు డబ్బులు తరలించినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. 
 
ఇందుకు సంబంధించిన వంద బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. తొలిరోజు దాడుల్లో సుమారు వెయ్యి కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. రెండో రోజు దాడుల్లో వజ్రవైఢూర్యాలు, బంగారు, వెండ సంపదను గుర్తించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక మూడవరోజు పలు స్తిరాస్థులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments