డిఎంకె అభ్యర్థి బంధువుల నివాసాలపై ఐటి దాడులు

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (10:02 IST)
తమిళనాడులో ఎన్నికల వేళ డిఎంకె అభ్యర్థి బందువుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటి) దాడులు జరుపుతోంది. తిరుప్పూరు జిల్లా తారాపురం నియోజకవర్గంలో డిఎంకె తరఫున కయల్‌విళి సెల్వరాజ్‌ పోటీ చేస్తున్నారు.

ఆ నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా డిపిఐ, ఎండిఎంకె, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆ ప్రాంతంలోని ఎండిఎంకె నేత కవిన్‌ నాగరాజ్‌, ఆయన సోదరుడు మక్కల్‌ నీదిమయ్యం కోశాధికారి చంద్రశేఖర్‌, డిఎంకె నేత ధనశేఖర్‌ నివాసాలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ఐటి అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు.

రెండు రోజులు నిర్వహించిన సోదాల్లో రూ.8 కోట్ల నగదు పట్టుబడినట్లు అధికారులు ప్రకటించారు. పన్నుల ఎగవేతకు సంబంధించి కీలకమైన పత్రాలు లభించాయని అన్నారు.

ఐటి దాడులపై డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌, టిఎన్‌సిసి అధ్యక్షుడు అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను భయపెట్టేందుకే కేంద్రం ఈ ఐటి శాఖను ప్రయోగించిందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments